Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి

Follow Udayam Digital on Google
కౌశిక్ శర్మ Aug 01, 2026 5:48 PM సంగారెడ్డితెలంగాణ
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దరఖాస్తుపల్లి గ్రామస్తులు దాడి చేశారు. అనుమానాస్పద స్థితిలో బీరప్ప (22) మృతి చెందడంపై ఆగ్రహంతో స్టేషన్‌లోని ఫర్నిచర్, అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా చెట్టు నుంచి దించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులతో వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...