వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియాలో యూపీకి చెందిన ఇద్దరు భారతీయ సోదరులు అరెస్ట్ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధ బాధితులైన ఇరాన్ పౌరుల సహాయార్థం, భారత్లోని ఇరాన్ ఎంబసీ బ్యాంకు ఖాతాకు వారు 200 రియాల్స్ విరాళం పంపారు. ఈ ఆర్థిక లావాదేవీని గుర్తించిన సౌదీ భద్రతా సిబ్బంది మార్చిలో వారిని అదుపులోకి తీసుకున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా మహమ్మద్ జాఫర్, మహమ్మద్ రహీబ్లను అరెస్ట్ చేసినట్లు రియాద్లోని భారత ఎంబసీ ధృవీకరించింది. తమ కుమారులను సురక్షితంగా విడిపించాలని బాధితుల తల్లిదండ్రులు భారత విదేశాంగ శాఖను ఆశ్రయించగా, ప్రస్తుతం సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంబసీ పేర్కొంది.
Comments
Loading comments...

