Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేటి నుంచి ఏపీలో టెట్ పరీక్షలు ప్రారంభం

Follow Udayam Digital on Google
నేటి నుంచి ఏపీలో  టెట్ పరీక్షలు ప్రారంభం - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ టెట్-2026 పరీక్షలు నేటి (ఆగస్టు 5) నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ప్రతిరోజూ రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి విడత ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకుంటే ఆధార్, పాన్ లేదా ఓటరు ఐడీ తీసుకెళ్లాలి.

Comments

G
Loading comments...