వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం జరిగిన పెరుగు బసంతోత్సవంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రాజీవ్ గృహకల్పలోని దత్తాత్రేయస్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ అర్చకులు వారికి శాలువాతో సన్మానించి ఆశీర్వచనాలు అందించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారు ప్రార్థించారు.
Comments
Loading comments...
