Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరిలో పెరుగు బసంతోత్సవం: పాల్గొన్న స్పీకర్

Follow Udayam Digital on Google
dasari naveen kumar Jul 29, 2026 5:39 PM వికారాబాద్తెలంగాణ
అనంతగిరిలో పెరుగు బసంతోత్సవం: పాల్గొన్న స్పీకర్ - Udayam Digital
అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం జరిగిన పెరుగు బసంతోత్సవంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రాజీవ్ గృహకల్పలోని దత్తాత్రేయస్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి శాలువాతో సన్మానించి ఆశీర్వచనాలు అందించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారు ప్రార్థించారు.

Comments

G
Loading comments...