Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి PGRSకు 306 వినతులు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 10, 2026 5:48 PM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
అనకాపల్లి PGRSకు 306 వినతులు - Udayam
అనకాపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు ప్రజల నుంచి 306 వినతులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వాటిలో రెవెన్యూ శాఖకు 170, సర్వే శాఖకు 27, పోలీసు శాఖకు 16 ఫిర్యాదులు వచ్చాయి. అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను జేసీ ఆదేశించారు.

Comments

G
Loading comments...