వార్తలకు తిరిగి వెళ్లండి

కాళ్ల మండలం ఏలూరుపాడు వద్ద రాష్ట్రీయ రహదారి అధ్వానంగా మారింది. భారీ గుంతలు ఏర్పడటంతో భీమవరం–విజయవాడ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రివేళ గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

