వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ పోలీసులు దేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 అత్యవసర సేవలను ప్రారంభించారు. హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డీజీపీ సీవీ ఆనంద్ ఈ సేవలను ప్రారంభించారు.
పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, బాలల రక్షణ సేవలను ఒకే నంబరుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు ఏఐ, డ్రోన్ సాంకేతికతను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
