Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుమ్మలకు సమస్యలు చెప్పిన ఏజెన్సీ ప్రజలు

Follow Udayam Digital on Google
రేఖ దేవి Aug 05, 2026 1:17 PM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
తుమ్మలకు సమస్యలు చెప్పిన ఏజెన్సీ ప్రజలు - Udayam Digital
ఏజెన్సీ ప్రాంత పర్యటనలో భాగంగా చర్లకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. వద్దిపేట చెక్‌డ్యామ్‌ సమస్య పరిష్కారం, రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రాలు అందించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా చర్ల మీదుగా వెళ్తూ మంత్రి కొద్దిసేపు ఆగారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...