వార్తలకు తిరిగి వెళ్లండి

అడవులు, వన్యప్రాణులను సంరక్షిస్తేనే భవిష్యత్ తరాలకు సురక్షితమైన భవిష్యత్తు ఉంటుందని జన్నారం అటవీశాఖ ఎఫ్డీఓ రామ్మోహన్ అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
పోటీల్లో విజేతలైన విద్యార్థులకు రామ్మోహన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓలు ఖాదర్ వలీ, లక్ష్మీనారాయణ, అటవీశాఖ సిబ్బంది, లెక్చరర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...
