వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్యుతాపురం పరిధిలో మంగళవారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ముగ్గురిలో ఒకరికి ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు మహిళా ఎస్ఐ పోషణ గౌరీ తెలిపారు. మరో ఇద్దరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు పోషణ గౌరీ చెప్పారు.
ముగ్గురిపై కేసులు నమోదు చేసి ఎలమంచిలి న్యాయస్థానంలో హాజరుపరిచారు. మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదకరమని, కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

