వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్, నిజామాబాద్లలో 16 చోట్ల జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
పత్రాల ప్రకారం వీటి విలువ రూ.17.94 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో మాత్రం వాటి విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఫ్లాట్లు, విల్లాలు, వ్యవసాయ భూములు, నగదు, బంగారం, విదేశీ మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

