వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు శ్రీ సిద్ధి గణపతి స్వామివారిని ఆకాశ వర్ణంలో విశేషంగా అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు.
ఆకాశ వర్ణ అలంకరణలో కొలువుదీరిన శ్రీ సిద్ధి గణపతి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
Comments
Loading comments...

