Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్‌ కార్డుతో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 10, 2026 12:14 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
ఆధార్‌ కార్డుతో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం - Udayam
ఆధార్‌ కార్డు ఉన్నవారు ప్రత్యేక కౌంటర్లలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం కొనుగోలు చేయవచ్చని ఇన్‌చార్జి డీఎస్‌ఓ లక్ష్మి తెలిపారు. నెలకు 10 కిలోలు ఒకేసారి లేదా 5 కిలోల చొప్పున రెండు విడతల్లో తీసుకోవచ్చన్నారు. సూపర్‌ ఫైన్‌ స్టీమ్‌ బియ్యం కిలో రూ.52, గ్రేడ్‌-1 పచ్చి బియ్యం రూ.50కు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆరు కౌంటర్ల ద్వారా ఇప్పటికే 31 క్వింటాళ్ల బియ్యం విక్రయించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...