వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాలను కలిపే 365బీబీ జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్రం రూ.840.41 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 45.09 కిలోమీటర్ల మార్గాన్ని ఉన్నతీకరించనున్నారు.
దీంతో పోలవరం పరిసరాలకు అనుసంధానం మెరుగుపడుతుంది, పంటల రవాణా సులభమవుతుంది అని గడ్కరీ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో భక్తులు, పర్యాటకులకూ ప్రయోజనం కలుగుతుందని గడ్కరీ తెలిపారు.
Comments
Loading comments...

