వార్తలకు తిరిగి వెళ్లండి

2019 నుంచి ఈ ఏడాది జూలై వరకు విదేశాలకు పరారైన 274 మంది తీవ్ర నేరగాళ్లను 36 దేశాల సహకారంతో భారత్కు రప్పించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఐబీ, సీబీఐ సహా పలు సంస్థలు సమన్వయంతో పనిచేశాయని తెలిపింది.
పరారీలో ఉన్న నేరగాళ్ల అప్పగింత కోసం ప్రత్యేక వ్యూహంతో చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం సహా పలు చట్టాల అమలుతో ఈ ప్రక్రియ మరింత బలోపేతమైందని వివరించింది.
Comments
Loading comments...
