వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తోటలచెరువుపల్లెకు చెందిన ఆర్మీ జవాను పగడాల రవి (38) 20 రోజులుగా అదృశ్యమయ్యారు. జూలై 19న నాగాలాండ్లోని ధీమాపూర్ రైల్వే స్టేషన్లో భార్యతో చివరిసారిగా మాట్లాడిన తర్వాత ఆచూకీ లేదు.
ఒడిశాలోని భద్రక్లో చివరి ఫోన్ సిగ్నల్ గుర్తించారు. బెంగళూరు రైల్వే స్టేషన్లో రవి ఐడీ కార్డు, ఇతర పత్రాలు లభించాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.
Comments
Loading comments...
