వార్తలకు తిరిగి వెళ్లండి
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆర్ కృష్ణయ్య!

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగులు కాంగ్రెస్ను నమ్మి గెలిపించారని, కానీ ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని నిరుద్యోగ జేఏసీ సదస్సులో కృష్ణయ్య హెచ్చరించారు.
Comments
Loading comments...