వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం దమ్మల వీధిలో నూతనంగా నిర్మించిన నాగవల్లి బాస్కెట్బాల్ గ్రౌండ్ను ఎమ్మెల్యే గొండు శంకర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి బాస్కెట్బాల్ ఆడి యువతలో ఉత్సాహం నింపారు.
క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి దోహదపడతాయని, నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, క్రీడాకారులు, యువత, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

