Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీకి పీవీఎల్ నరసింహారాజు గుడ్‌బై?

స్వాతి రెడ్డి Jul 24, 2026 11:10 AM పశ్చిమగోదావరి about 2 hours ago
వైసీపీకి పీవీఎల్ నరసింహారాజు గుడ్‌బై? - Udayam Digital
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసీపీ సీనియర్ నేత, మాజీ ఇన్‌ఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. పార్టీ అధినేత జగన్ వైఖరిపై నిరాశతోనే ఆయన ఈ అడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం స్థానిక వైసీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Comments

G
Loading comments...