వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే నెల 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 థీమ్గా "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా" (Yoga for Healthy Aging)ను నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ ప్రకటించారు. ఖజురహోలో జరిగిన యోగా మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ యోగా చేయడం ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రధాన యోగా దినోత్సవ వేడుకలను కోల్కతాలో నిర్వహించనున్నారు. ఇదే వేదికపై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల కోసం 'యోగా సంగమం', 'యోగా పార్క్' పోర్టళ్లను కూడా మంత్రి ప్రారంభించారు.
Comments
Loading comments...

