వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్లో ఆకస్మిక వరదల ధాటికి రసువా, నువాకోట్ జిల్లాల్లోని 11 జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 573 మందికిపైగా కార్మికులు సొరంగాల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత 934 మంది గల్లంతవగా 361 మందిని రక్షించారు.
సొరంగాల వద్ద 10 నుంచి 12 అడుగుల మేర బురద, శిథిలాలు పేరుకుపోయాయి. చిక్కుకున్న వారిని కాపాడేందుకు నేపాల్ ఆర్మీతోపాటు భారత టన్నెల్, వైద్య నిపుణుల బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
Comments
Loading comments...

