వార్తలకు తిరిగి వెళ్లండి
రోడ్డు విస్తరణ నోటీసులతో మహిళ మృతి

కరీంనగర్ జిల్లా సుందరగిరిలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్నాననే మనోవేదనతో బుర్ర మధురవ్వ (55) అనే కూరగాయల వ్యాపారి గురువారం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
గ్రామంలో రహదారి విస్తరణ కోసం అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆమె తీవ్ర ఆందోళన చెందారు. కూరగాయలు అమ్ముకొని ఇంటికి రాగానే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నిండింది.
Comments
Loading comments...