Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 31న వెలిగొండకు నీళ్లు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 11:32 AM అమరావతిGeneral
ఆగస్టు 31న వెలిగొండకు నీళ్లు - Udayam
వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఆగస్టు 31న నీటిని విడుదల చేసి నల్లమలసాగర్‌ జలాశయాన్ని నింపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తొలిదశ ప్రాజెక్టు పూర్తయిందని ఆయన తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల పరిహారం చెక్కును అందించారు. ఇప్పటివరకు 6,206 కుటుంబాలకు రూ.768 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. వీలైతే ఆగస్టు 30నే నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...