Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృత్తి కళాకారులకు పెన్షన్ ఇవ్వాలి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 8:35 PM పల్నాడుGeneral
వృత్తి కళాకారులకు పెన్షన్ ఇవ్వాలి - Udayam
కళాకారుల సమస్యల పరిష్కారానికి ప్రజా నాట్యమండలి నిరంతరం పోరాడుతోందని పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి బైరాపట్నం రామకృష్ణ తెలిపారు. సత్తెనపల్లి ఏరియా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వృత్తి కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు నెలకు రూ.6 వేల పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 22, 23 తేదీల్లో వినుకొండలో జరిగే ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...