వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందరావుపేట మండలం లక్నవరం ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్నవరం చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో సాగునీటిపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
బుధవారం వర్షాలు కురవాలని కోరుతూ రైతులు సంప్రదాయ పద్ధతిలో కప్పతల్లి ఆటలు నిర్వహించారు. రెండు కప్పలకు పసుపు, కుంకుమతో వివాహం జరిపించి, డప్పు చప్పుళ్ల మధ్య గ్రామంలో ఊరేగించారు.
Comments
Loading comments...

