Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణ తుది దశకు

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Aug 07, 2026 4:38 PM సంగారెడ్డితెలంగాణ
ఓటర్ల జాబితా సవరణ తుది దశకు - Udayam Digital
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ జిల్లాలో తుది దశకు చేరింది. తప్పులులేని పారదర్శక ఓటరు జాబితా తయారీ లక్ష్యంగా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ పూర్తి చేశారు. జిల్లాలో 1,51,984 మంది ఓటర్లను అన్‌కలెక్టబుల్‌ జాబితాలో గుర్తించారు. ఇందులో శాశ్వత వలసలు, మృతులు, అందుబాటులో లేని వారు, డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 17న ముసాయిదా జాబితా విడుదల కానుంది.

Comments

G
Loading comments...