వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలోని శ్రీ బాలాజీ డెంటల్ క్లినిక్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రాత్రి క్లినిక్ మూసి ఉన్న సమయంలో గ్రిల్స్, మెయిన్ డోర్ తాళాలు పగలగొట్టి కౌంటర్లోని రూ.50 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఉదయం చోరీని గుర్తించిన క్లినిక్ యజమాని డాక్టర్ శివకుమార్ వనపర్తి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు.
Comments
Loading comments...

