వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ బీచ్రోడ్డులో జరుగుతున్న అగ్నివీర్ ఎంపికల్లో భాగంగా పరుగు పరీక్షలో పాల్గొన్న ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిన్ని శేషగిరిరావు కేజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నివీర్ ర్యాలీలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

