వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో 120 వార్డుల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
SIR ప్రక్రియ సమయంలో డీలిమిటేషన్ చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. వార్డుల వైశాల్యంలో మార్పులు చేయలేదని ప్రభుత్వం వివరించడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది.
Comments
Loading comments...

