Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక ఊరేగింపులో డాన్స్ చేస్తూ వ్యక్తి మృతి

Follow Udayam on Google
Dorababu M Sep 20, 2026 9:48 AM పశ్చిమగోదావరిGeneral
వినాయక ఊరేగింపులో డాన్స్ చేస్తూ వ్యక్తి మృతి - Udayam
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక చవితి ఊరేగింపులో తీవ్ర విషాదం నెలకొంది. టాక్సీ ఓనర్స్ యూనియన్ నిర్వహించిన ఊరేగింపులో బ్యాండ్ సౌండ్స్ మధ్య స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తూ కాకర్లముడి యేసు (48) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడు టిడ్కో కాలనీకి చెందిన వ్యక్తి.

Comments

G
Loading comments...