Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్‌ఐ

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 3:43 PM అన్నమయ్యGeneral
వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్‌ఐ - Udayam
వినాయక చవితి సందర్భంగా వీరబల్లి మండలంలో మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అనుమతి తీసుకోవాలని ఎస్‌ఐ సుస్మిత సూచించారు. అన్ని అనుమతులు ఒకేచోట పొందేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయడం, నిబంధనలు ఉల్లంఘించడం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

Comments

G
Loading comments...