వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే OP రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉండటంతో రోగులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. వివిధ చికిత్సల కోసం వచ్చిన వారు ముందుగా ఓపీ నమోదు కోసం ఇబ్బందులు పడుతున్నారు.
వైద్యం సంగతి పక్కన పెడితే రిజిస్ట్రేషన్ కే గంటలు పడుతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి మరో OP కౌంటర్ ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలన్నారు.
Comments
Loading comments...

