Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 2:20 PM కృష్ణా జిల్లాGeneral
విజయవాడ రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం - Udayam
విజయవాడ రైల్వే స్టేషన్‌లో గురువారం సుమారు రూ.19 లక్షల విలువైన 38 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రైల్వే ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ పర్యవేక్షణలో జీఆర్పీ, ఆర్‌పీఎఫ్, ఈగల్ టీమ్, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని రెండు కేసులు నమోదు చేశారు. వారి నుంచి నాలుగు బండిళ్ల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...