వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు మండల కేంద్రంలో ఈనెల 22న నిర్వహిస్తున్న ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర కాంశ్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానిక టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుందన్నారు.
ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని పార్టీ నాయకులకు ఆమె సూచించారు.
Comments
Loading comments...

