వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలం జంగాం గ్రామ శివారులో ఆదివారం విద్యుత్ షాక్తో వ్యవసాయ ఎద్దు మృతి చెందింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఎల్టీ విద్యుత్ లైన్ తెగిపడటంతో పొలంలో మేతకు వెళ్లిన రైతు బొమ్మెడి మల్లేష్కు చెందిన ఎద్దు విద్యుత్ తీగను తాకి అక్కడికక్కడే మృతి చెందింది.
ఎద్దు విలువ సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

