వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్లో గన్ వయెలెన్స్ పెరిగిపోతోంది. అందులోనూ గాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తాజాగా మరో సింగర్ ఇంటిపై కాల్పులు జరిగాయి. పంజాబి సింగర్ గులాబ్ సిద్ధు ఇంటిపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు. పంజాబ్, బర్నాలా జిల్లా, ఫర్వాహి గ్రామంలో శనివారం రాత్రి స్థానిక సింగర్ గులాబ్ సిద్ధు ఇంటివద్ద ఈ ఘటన జరిగింది.
Comments
Loading comments...

