Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబాలకు రూ5 లక్షల పరిహారం అందజేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Devender Bale Sep 15, 2026 11:52 AM జగిత్యాలGeneral
విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబాలకు రూ5 లక్షల పరిహారం అందజేసిన ఎమ్మెల్యే - Udayam
విద్యుత్ షాక్‌తో మృతిచెందిన తిప్పన్నపేటకు చెందిన చింతకుంట రాజ నర్సయ్య, జగిత్యాల బుడగజంగాల కాలనీకి చెందిన సిరిగిరి ఎల్లవ్వ కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల చొప్పున విద్యుత్ ప్రమాద పరిహారాన్ని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు. ఒక్కొక్కరికి రూ.50 వేల చెక్కు, రూ.4.50 లక్షల బాండ్‌ను క్యాంపు కార్యాలయంలో అందించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...