వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ ఆక్రమణ కలుపు మొక్కలను నిర్మూలించి, స్థానిక జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఈకో ఫాన్ సొసైటీ ఆధ్వర్యంలో విదేశీ కలుపు మొక్కల నిర్మూలనపై అవగాహన, గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు. విదేశీ ఆక్రమణ మొక్కల నిర్మూలనకు ప్రతీకగా రూపొందించిన ప్రత్యేక “థంబ్స్ డౌన్”సంకేతాన్ని పాల్గొన్న వారంతా ప్రదర్శించారు.
Comments
Loading comments...

