వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్గటూర్ మండలంలోని కచ్చిరు ప్రాంతంలో 1985లో గణపతి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. గోలి సత్తయ్య, గుమ్ముల మల్లయ్య, పెద్దూరి నారాయణతో పాటు పలువురు కలిసి అప్పట్లో వేడుకలు ప్రారంభించారని పేర్కొన్నారు.
అప్పటి నుంచి కచ్చిరు వద్ద అదే గణపతి గుడిలో ఏటా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం గణి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

