వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెంకట రాజుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఓ అశోక్ లేలాండ్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న హైవే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరో ప్రమాదం జరగకుండా క్రేన్ సహాయంతో వాహనాన్ని రోడ్డు పక్కకు తొలగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

