Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'వందేమాతరం' గేయాన్ని అవమానిస్తే.. మూడేళ్ల జైలు!

అనురూప్ గౌడ్ Jul 19, 2026 7:36 PM అల్ ఇండియా about 16 hours ago
'వందేమాతరం' గేయాన్ని అవమానిస్తే.. మూడేళ్ల జైలు! - Udayam Digital
జాతీయ గేయం ‘వందేమాతరం’ని అవమానించడం లేదా దాని ఆలపనకు ఆటంకం కలిగించడం ఇకపై చట్టరీత్యా నేరంగా మారనుంది. 1971 నాటి ‘నేషనల్ హానర్’ చట్టానికి సవరణలు చేస్తూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ సవరణతో వందేమాతరానికి జాతీయ గీతం ‘జన గణ మన’తో సమానమైన గౌరవం, రక్షణ లభించనున్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...