Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

85 వేల మొక్కల్లో వందేమాతరం

Follow Udayam on Google
విహార్ Aug 15, 2026 9:00 AM అమరావతిఆంధ్రప్రదేశ్
85 వేల మొక్కల్లో వందేమాతరం - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 150 ఏళ్ల వందేమాతర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేసేందుకు తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు వినూత్నంగా ఆకృతిని రూపొందించారు. పల్లా వెంకన్న నర్సరీలో 85 వేల మొక్కలతో వందేమాతరం ఆకృతిని తీర్చిదిద్దారు. నర్సరీ రైతు సత్తిబాబు నేతృత్వంలో దాదాపు వారంపాటు శ్రమించి దీనిని రూపొందించినట్లు యువ రైతులు వెంకటేశ్‌, వినయ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...