Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వాగులో కొట్టుకుపోయిన కారు.. 8 మంది మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 12:49 PM జాతీయంGeneral
మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయి 8 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఒడిశాకు చెందిన వీరంతా ఉజ్జయిని నుంచి నల్ఖేడాలోని మా బాగ్లాముఖి ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బలమైన ప్రవాహంలో డ్రైవర్ హడావుడిగా వాగు దాటేందుకు ప్రయత్నించడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Comments

G
Loading comments...