వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవాల్లో కమిషనర్ రాహుల్ మీనా మంగళవారం పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూనే భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ సూచించారు.
Comments
Loading comments...

