వార్తలకు తిరిగి వెళ్లండి

నక్కపల్లి మండలం గొడిచెర్ల పీఏసీఎస్ ద్వారా సోమవారం నుంచి రైతులకు యూరియా పంపిణీ ప్రారంభించారు. ఆరేళ్లుగా ఆర్బీకేల ద్వారా యూరియా పంపిణీ జరిగేదని పీఏసీఎస్ ఛైర్మన్ దార్ల కృష్ణ తెలిపారు.
సొసైటీ ద్వారా ఎరువులను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో హోంమంత్రి అనిత సహకారంతో లైసెన్స్ పొందినట్లు చెప్పారు. రైతులకు సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సీఈఓ కె. సూర్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

