Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరుకుందలో బైక్ దొంగల అరెస్టు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 11:17 AM కర్నూలుGeneral
ఉరుకుందలో బైక్ దొంగల అరెస్టు - Udayam
ఉరుకుంద క్షేత్రానికి శ్రావణమాసంలో వచ్చిన భక్తుల బైక్‌లను చోరీ చేసిన ముగ్గురు నిందితులను కౌతాళం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు. వాహనాల విడిభాగాలు, రిజిస్ట్రేషన్ నంబర్లు మార్చి విక్రయించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...