వార్తలకు తిరిగి వెళ్లండి

కౌడిపల్లిలో రేపు రైతులకు 985 బస్తాల యూరియా అందుబాటులో ఉంటుందని మండల వ్యవసాయ అధికారి స్వప్న జాదవ్ తెలిపారు. గ్రోమోర్, భాగ్యలక్ష్మి ట్రేడర్స్ దుకాణాల్లో యూరియా అందుబాటులో ఉంటుందని స్వప్న జాదవ్ చెప్పారు.
ఇప్పటివరకు మండలానికి 1,082 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని తెలిపారు. గతేడాది 1,152 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Loading comments...

