వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని శ్రీనగర్ కాలనీ అయ్యప్ప స్వామి ఆలయం వెనుక గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నాలుగో పట్టణ సీఐ మస్తాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు, హత్యకు పాల్పడిన వ్యక్తుల ఆచూకీ కోసం విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...

