వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద వైబీఎం ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, సహాయకుడితో పాటు 13 మంది ప్రయాణికులు గాయపడగా, ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు.
డ్రైవర్ నిద్రమత్తు, అధిక వేగం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ముందున్న లారీని తప్పించే క్రమంలో బ్రేక్ వేయడం, వర్షం వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు.
Comments
Loading comments...

