వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్జీ-2 డివిజన్ యైటింక్లయిన్ కాలనీలో అనధికార నివాసాలపై యాజమాన్యం సర్వే చేపట్టింది. షిర్కే ప్రాంతంలోనే 730 మంది కార్మికేతరులు అనుమతులు లేకుండా నివాసం ఉంటున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
అక్రమ విద్యుత్ వినియోగం, అనుమతి లేని నివాసాలపై చర్యలు ప్రారంభించగా ఇప్పటికే కొన్ని క్వార్టర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సర్వే అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
Comments
Loading comments...

